Monday, 27 July 2026 12:10:02 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నకిలీ ధృవపత్రాలతో పాస్‌పోర్ట్ పొందడానికి యత్నం - నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, 5వేల రూ జరిమానా

Date : 27 January 2026 08:23 PM Views : 158

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 27: తప్పుడు పత్రాలతో పాస్‌పోర్ట్ పొందేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కిన వ్యక్తికి రాయచోటి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఫోర్జరీ పత్రాల కేసులో నిందితుడైన షేక్ వసీం అక్రమ్‌కు రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ గౌరవనీయ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ టి. సుయోధన గారు మంగళవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాయచోటి టౌన్ అలీమాబాద్ వీధికి చెందిన ఖాజా హుస్సేన్ కుమారుడు షేక్ వసీం అక్రమ్ 2023 నవంబర్ 5న ECNR పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియలో భాగంగా అతను తన పదవ తరగతి మార్కుల మెమోను ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలను అసలైనవిగా నమ్మించి అధికారులను మోసం చేసేందుకు ప్రయత్నించాడు.వసీమ్ అక్రమం పై అప్పటి ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి అర్బన్ పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి సీఐ సుధాకర్ రెడ్డి సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడి పై క్రైమ్ నంబర్ 168/2023 కింద సెక్షన్ 420, 464, 468 (IPC) ప్రకారం కేసు నమోదు చేశారు. పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ సాయి రామకృష్ణ పటిష్టమైన వాదనలు వినిపించారు. నేరం నిరూపితం కావడంతో, న్యాయమూర్తి నిందితుడు వసీమ్ అక్రమ్ కి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, 5వేల రూ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :