నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 26 : తంబళ్లపల్లె మండలంలో (ఎస్.పి.డీ.సీ.ఎల్) ఇరువురు విద్యుత్ శాఖ ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇరువురికి ప్రశంసా పత్రాలు దక్కాయి. సోమవారం మదనపల్లె జిల్లా కార్యాలయంలో విద్యుత్ శాఖలో రైతులకు, వినియోగదారులకు అందించిన సేవలు, సకాలంలో బిల్లుల చెల్లింపులు పలు సేవలందించినందుకు గాను కుక్క రాజు పల్లి ఏఎల్ఎం అమీన్, ముద్దలదొడ్డి జేఎల్ఎం శ్రీకాంత్ లకు విద్యుత్ శాఖ డిఈ గంగాధర్ ప్రశంస పత్రాలు అందజేశారు. వారిని ఏఈ సురేంద్ర, లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్ శంకర, నాగేంద్ర, ఆయాజ్, నవాజ్,ఇంతియాజ్, నాగేంద్రబాబు, శేషు, కాలేశా, రమేష్, సురేష్, ప్రవీణ్, రాజశేఖర్ విద్యుత్ సిబ్బంది ,మండల స్థాయి అధికారులు, అధికార పార్టీ నాయకులులుఅభినందించారు
Reporter
Namitha News