నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - డిసెంబర్ 22 : పుంగనూరు పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో మాల మహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు 20వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సంఘ నాయకులు, సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ ఆర్ అశోక్ మాట్లాడుతూ, వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాలలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చిన మహానుభావుడు పీవీ రావు అని కొనియాడారు. మాలల హక్కుల సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి దళిత సమాజానికి దిశానిర్దేశం చేసిన నాయకుడు అని గుర్తు చేశారు. పీవీ రావు మరణించి 20 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయన చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Namitha News