నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 : రాష్ట్ర ఐటీ మంత్రి యువతేజం నారా లోకేష్ భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడుగా కీర్తి గడించాలని తంబళ్లపల్లె మండల మహిళా మణులు మనసారా ఆశీర్వదించారు. శుక్రవారం మండల టిడిపి నాయకురాలు సిద్ధమ్మ ఆధ్వర్యంలోలోకేష్ పుట్టినరోజు వందలాది మహిళ మణులు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నేడు దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు ఉచిత రవాణా తోబాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కల్పించిన ఘనత లోకేష్ దేనని ఆయన సారథ్యంలో మహిళా శక్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మహిళా సమాఖ్య సభ్యులు, ఐకెపి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News