Sunday, 26 July 2026 03:55:48 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ

స్వాతంత్ర సమర యోధుల పేర్లను తొలగించి,చరిత్రలో లేని వాళ్ళ పేర్లు పెట్టడం ఏంటీ...?

Date : 17 April 2026 09:09 PM Views : 168

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 17 : మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కు స్వాతంత్ర సమర యోధుల పేర్లను కాదని రామ్ జీ ఆంటూ చరిత్రలోలేని,పరిపాలనకు ఆదర్శం కాని ఒక వర్గ భావజాలానికి సంబందించిన వ్యక్తుల పేర్లు పెట్టడం ఏంటని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప విమర్శించారు.శుక్రవారం బి.కొత్తకోటలో ఆపార్టీ నియోజకవర్గపుకార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి మరియు మండల ముఖ్య నాయకులతో కలిసి స్థానిక విలేకరులతో మాట్లాడారు.ఈ మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పధకం పేరులో మార్పులు చేస్త్తూనే,గాందీ గారి పేరును తొలిగించి, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల కేటాయింపులను కూడా పూర్తీగా తగ్గించేసిందని,అప్పటి నుంచి ఇటు కాంగ్రెస్ తో పాటు,వామ పక్షాలు కూడా దీనిని పూర్తీగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తూనే వున్నాయన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అనంతపురంలో సీపీఐ,వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘాలతో పాటు సిపిఎం,కాంగ్రెస్,వైఎస్ఆర్ సీపీ నాయకత్వం మద్దతుతో ఒక మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించడం జరిగిందని ఈ యొక్క పాదయాత్ర ముగింపు సభలో కష్టజీవులు వేలాది మంది పాల్గొని విజయవంతం చేశారని అన్నారు.నాడు కమ్యూనిస్టుల సూచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరికీ పనిలేని దినాల్లో పని కల్పించాలనే లక్ష్యంతో ఆనాడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను యూపీఏ ప్రభుత్వం అమలు చేసిందని,ఈ పధకం ఎంతో దిగ్విజయంగా అమలవుతోందని,అలాంటి పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇక మళ్ళీ మేము అధికారం లోకి వస్తామో రామో అనే ఉద్దేశంతో ఇప్పుడే ఆ పథకానికి తూట్లు పొడిచి, ఆ పథకాన్ని రద్దు చేసెయ్యాలనే దురుద్దేశంతోనే ఈ కుట్రలకు పాల్పడుతోందన్నారు. ఇది వరకూ పూర్తి భారాన్ని భరించే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించుకొనే ఆలోచనతోనే ఈ రకమైన కుట్రలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ 3లక్షల 24 వేల కోట్ల రూపాయల అప్పుతో మూలుగుతుంటే...అదనంగా ఉపాధి హామీ పధకం కోసం మళ్లీ 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడనుంచి తీసుకురాగలదు? అని అయన కేంద్ర ప్రభుత్వం ను ప్రశ్నించారు.కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే తన నిధుల భారాన్ని తగ్గించుకొని,రాష్ట్రాలపై అదనపు భారాన్ని మోపి క్రమంగా ఆయా రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం రద్దుకు పరోక్షంగా కుట్రలు పన్నుతోందని,ఈ కుట్రలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాలని వారు సూచించారు.రాయలసీమ జిల్లాల్లో కరువు ఎంత భయంకర వాతావరణాన్ని సృష్టిస్తుందంటే వూళ్ళకు వూళ్ళు ఖాళీ చేసి కువైట్, కట్టర్,దుబాయ్ లాంటి విదేశాలకు,ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు వుంటాయని,ఇప్పుడు ఈ ఉపాధి పథకం కు ఇన్ని షరతులు పెడితే ఇది ఎలా ముందుకు సాగుతుందన్నారు.దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తీగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఉపాధికి సమాధి కట్టే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మికులు, కర్షకులు తమ ఉద్యమ పంథా ద్వార రాజకీయ సమాధి కట్టడానికి కార్మిక లోకం సిద్ధంగా ఉందన్నారు.కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ కొత్త పథకానికి పాతరేసి,పాత విధానాన్నే అనుసరించి, పెరిగిన రేట్లకు అనుగుణంగా కూలి రేట్లు కూడా పెంచాలని,లేనిపక్షంలో ఉపాథి కూలీలను,రైతుల ను కలుపుకొని బీజేపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా గట్టిగా బుద్ధి చెబుతామని వారు కేంద్ర ప్రభుత్వంను హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి జి. రఘునాథ్,పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్ అలీ, ఏఐటియు మండల సమితి అధ్యక్షుడు ఎస్.తంబయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: