నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 : తంబళ్లపల్లె మండలం లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నారి కార్యక్రమం ద్వారా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు మారుమూల గ్రామాల్లోని మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలని ఏపిఎం గంగాధర్ సూచించారు. శుక్రవారం మండల స్థాయి సీఆర్పీలు,మహిళా సంఘాల సమీక్షల ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఈనారి ద్వారా పేదరిక నిర్మూలన, గ్రామ సమైక్యాల బలోపేతం, సోషల్ క్యాపిటల్ పెంపు, మహిళల రుణాల సద్వినియోగం, మహిళా సంఘాల మెరుగైన ఫలితాల సాధన కోసం మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి ఎదగడానికి కృషి చేయాల్సి ఉందన్నారు. ఈ పలు అంశాలపై ఏపీఎం కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, మండల సమైక్య అధ్యక్షురాలు రామ లక్ష్మమ్మ, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News