Sunday, 26 July 2026 03:53:12 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

వృద్ధురాలైన తన భూమిని కాజేయాలని చూస్తున్న భూస్వామి

30 ఏళ్ల తన జీవనాధారాన్ని దూరం చేయవద్దు అంటున్న ఓ వృద్ధురాలు నరసమ్మ

Date : 09 January 2026 08:01 AM Views : 433

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 09: ఆత్మకూరు మండలంలోని మహిమలూరు గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వృద్ధురాలైన నరసమ్మ గత 30 ఏళ్లుగా తాను సాగుబడి చేసుకుంటున్న భూమిని అడ్డగించిన భూస్వామి నా భూమి ని నాకు కాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరినైనా తనపై దౌర్జన్యానికి దిగుతున్నారని , బెదిరింపులు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతో ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కథనం మేరకు సర్వే నెంబరు 165 /5 లోని నాలుగు ఎకరాల 41 సెంట్లు భూమి లో గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఇందులో రెండు ఎకరాల 30 సెంట్లు తనకు ప్రభుత్వం కేటాయించిందని మిగిలిన రెండు ఎకరాల 11 సెంట్లు శివాయి భూమిని తాను సాగు చేసుకుంటూ వస్తున్నానని తెలిపారు. 20 ఏళ్ల క్రితం తన భర్త మృతి చెందిన ఈ పొలం ఆధారంగానే ఎంతో కష్టపడి, సేద్యం చేసుకొంటూ ఐదుగురు ఆడపిల్లలకు వివాహాలు జరిపించానన్నారు. ప్రస్తుతం తనకు ఈ పొలమే జీవనాధారం , వృద్ధురాలైన నాకు దాపుగా ఎవరూ లేరని భూమి ని కాజేయాలని యత్నింస్తున్నారు. ప్రతి ఏడాది లాగే ఇప్పుడు కూడా పొలం దున్ని వరి నాటేందుకు పొలాన్ని సిద్ధం చేశానన్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ పొలం తనదేనంటూ సాగుబడికి అడ్డగించారన్నారు. వరి నాటుకునేందుకు వీలు లేకుండా అడ్డుకొని దాడి చేసేందుకు ప్రయత్నించారని, బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సాగు చేసుకుంటున్న భూమిని తనకు ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. ఒంటరిగా జీవిస్తున్న తనకు ఇదే జీవనాధారం అని తెలిపారు. తనకు న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య కైనా పాల్పడుతానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమ గ్రామంలో జరిగిన గ్రామసభలో తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తహసిల్దార్ సమస్యను పరిశీలించి తగు చర్యలు చేపడతామని తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :