నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఫిబ్రవరి 26 : పుంగనూరు పట్టణం లో వెలసియున్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం లో భాగంగా మూడవ రోజు సాయంత్రం స్వామి వారు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి అలంకారంలో ముత్యపు పందిరి వాహనం లో పుర వీధులలో తిరుగుతూ భక్తులను కటాక్షించారు. వాహనం ముందు మంగళ వాయిద్యాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి భజన కోలాట బృందాలు భజన, కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఆలయంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ వారి సంగీత కార్యక్రమాలు వీనుల విందుగా, శ్రావణానందకరంగా సాగుతున్నాయి.. ఉదయం మరియు సాయంత్రం ఆలయంలో విశేష హోమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పుర వాసులు అడుగడుగున స్వామి వారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆలయంలో ఉదయం సాయంత్రం అన్నప్రసాద వితరణ చేశారు. గోవింద నామాల పుస్తక ప్రతులను భక్తులకు ఉచితంగా అందించారు.
Admin
Namitha News