నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 26 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో దిగువ పేట వద్ద యున్న తూర్పు పాఠశాల హెచ్ ఎం హేమలత ఆధ్వర్యంలో వీర్ బాల్ దివాస్ 2025 వేడుకలు శుక్రవారం విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిధిలుగా రామసముద్రం పంచాయతీ సెక్రటరీ మునిస్వామినాయక్ పాల్గొని విద్యార్థుల ప్రతిభను వీక్షించారు. మునిస్వామి నాయక్ మాట్లాడుతూ ఈ తూర్పు పాఠశాలవిద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలచూసి నాకు చాలా సంతోషం ఆవుతున్నదని ఇదే పట్టుదలతో బాగా చదివి మీ తల్లి దండ్రులకు, మీకు విద్యా బోధన చేసిన గురువులకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకుని రావాలన్నారు. ఈ పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణ, విద్యాబోధన, పాఠశాల పరిశుభ్రత పై పాఠశాల హెచ్ ఎం హేమలత కు అభినందనలు తెలిపారు. వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పంచాయతీ సెక్రటరీ చేతులుమీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో మునిస్వామి నాయక్, హెచ్ ఎం హేమలత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News