నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం,డిసెంబర్ 7 మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు రామసముద్రం నూతన ఎస్ఐ దిలీప్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. స్టేషన్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామని తెలిపారు. నేరాలను అరికడతామని ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా సంప్రదించవచ్చని గ్రామాలలో ప్రశాంతత వాతావరణంతో కూడిన వాతావరణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రమేష్ బాబు రాయచోటి క్రైమ్ కు బదిలీ అయ్యారు.
Reporter
Namitha News