Sunday, 26 July 2026 09:52:13 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ లో ఘనంగా జాతీయ సాంకేతిక దినోత్సవం

Date : 11 May 2026 11:30 PM Views : 110

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 11 : మదనపల్లి సమీపం సమీపంలో అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ ఐ ఐ సి వారి ఆధ్వర్యంలో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి మరియు బెంగళూరు కు చెందిన ఖైద్రే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సి ఈ ఓ ఎమ్.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం దేశాభివృద్ధికి కీలకమని, యువత సృజనాత్మక ఆలోచనలు మరియు నూతన ఆవిష్కరణల ద్వారా సమాజానికి సేవ చేయాలని తెలిపారు. కృత్రిమ మేధస్సు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ఆటోమేషన్, ఆరోగ్య రంగాలలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఆధునిక సాంకేతిక ధోరణులకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, స్టార్టప్‌లు మరియు పరిశోధనల వైపు ముందడుగు వేయడం చాలా ముఖ్యమని తెలిపారు. యువత కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంపొందించుకొని, ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే ప్రపంచస్థాయి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, కోఆర్డినేటర్స్ బి.ప్రశాంత్, వి.గీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :