నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి - యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రెడ్డిగణేష్ పిలుపు - తెట్టు హైస్కూల్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ మదనపల్లె : విద్యార్థులు పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కలిచెట్ల రెడ్డిగణేష్ పిలుపునిచ్చారు.శుక్రవారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కురబలకోట మండలం,తెట్టు హైస్కూల్ నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రెడ్డి గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు నిరుపేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారన్నారు.ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చక్కగా అవగాహన చేసుకుని,తల్లిదండ్రుల సూచనలు,సలహాలు పాటిస్తే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చునని ఆయన సూచించారు.తమ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,అందులో నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.విద్యార్థులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు,యువశక్తి ఫౌండేషన్ సభ్యులు మహేష్,జస్వంత్,చక్రి,అంజి,వినయ్,గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News