నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 06 : వి.బి.జి. రాంజీ నూతన ఉపాధి చట్టం ద్వారా జరిగే పనులు కూలీలకు ఓ వరంలా నిలవాలని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం సూచించారు. శుక్రవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పై సమీక్ష నిర్వహించారు. మండలంలో నూతన ఉపాధి హామీ చట్టంపై ఆరు వారాల అవగాహన సదస్సుల నిర్వహణ పై ఆరా తీశారు. ఉపాధి హామీలో 125 రోజులు పెంచిన పని దినాలు, ప్రతి ఒక్కరికి పని కల్పించి వారాంతంలో బిల్లు చెల్లింపు, నిరుద్యోగ భృతి, ఉపాధి హామీ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పనుల నిర్వహణలో భవిష్యత్తు ప్రణాళిక స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు పోవాలన్నారు. నూతన ఉపాధి చట్టం పై గోడ రాతలు, విద్యార్థులచే అవగాహన ర్యాలీలు, పాఠశాలలలో విద్యార్థులకు వికసిత్ భారత్ పై పోటీలు నిర్వహించాలన్నారు. ఉపాధి హామీ పనులు ఫారం పాండ్స్, చెరువుల కాలువల మరమ్మతులు, పండ్ల తోటల పెంపకం, పశువుల గడ్డి పెంపకానికి ప్రాధాన్యత నివాళులున్నారు. ఈ సమీక్షలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టి.ఎ లు బాలగంగాధర్, పుష్పకుమారి, సుజాత,భూదేవి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News