నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్వామి వివేకానంద ను యువత ఆదర్శంగా తీసుకోవాలి . కురబల కోట - జనవరి 12 : కురబలకోట మండలం అంగళ్ళుకు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద ను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. దేశభక్తి అభివృద్ధి కోసం స్ఫూర్తినింపడంలో ఆయన కీలక పాత్ర పోషించారాని కొనియాడారు. .ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని యువజన ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు తీసుకొని సమాజానికి సేవలు అందించాలని కోరారు. వై స్.ప్రిన్సిపల్ టి.ఎస్. గౌస్ బాషా మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడంలో యువత ముందు ఉండాలన్నారు. వివేకానంద స్ఫూర్తిభవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను యువత చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ హర్షద్ ఆలీ, బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారు . విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో యువజన ఉత్సవ కార్యక్రమం.
Reporter
Namitha News