నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మైనార్టీ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసిన నాగూర్ వలి మదనపల్లె : రాష్ట్రంలోని మైనార్టీ ప్రముఖులను మదనపల్లి పట్టణానికి చెందిన ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.విజయవాడలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూ ఖ్ షుబ్లీ,రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ బాషా,రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ హాజీ కె.నాగూల్ మీరాలని కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఇందులో భాగంగా మైనార్టీల సంక్షేమం,అభ్యున్నతికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు.రాష్ట్రంలో ఉర్దూ బాషా అభివృద్ధికి,హజ్ యాత్రికలకు కల్పించాల్సిన సౌకర్యాలు,దూదేకులను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చొరవ చూపాలని నాగూర్ వల్లి వారిని కోరారు.రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూదేకుల అభ్యున్నతికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని,హజ్ యాత్రలకు గతంలో కంటే రెట్టింపు సౌకర్యాలు కల్పిస్తున్నారని,ఉర్దూ భాష అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారున్నారు.భవిష్యత్తులో వీటిని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు.అదేవిధంగా మదనపల్లి జిల్లా,నియోజకవర్గం అభివృద్ధి,మైనార్టీల సంక్షేమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి చేపడుతున్న కార్యక్రమాలను,సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న తీరును వారికి వివరించగా ప్రత్యేకంగా ప్రశంసించారన్నారు.
Reporter
Namitha News