నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 16 : తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లె పంచాయతీ రెడ్డి కోట పంచాయతీలలో కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై వైకాపా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించినట్లు వైకాపా మండల అధ్యక్షుడు రేపన చౌడేశ్వర తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు పంచాయతీలలోని గ్రామాలలో వైకాపా నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా పర్యటించి కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకతపై కోటి సంతకాల లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామలాకోటిరెడ్డి, నరేందర్ రెడ్డి, తాళ్ల చంద్రశేఖర, రమేష్ రెడ్డి, పుల్లారెడ్డి, వాటర్ సెట్ చైర్మన్ భాష, పద్మనాభ రెడ్డి, మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News