నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 28 ః తంబళ్లపల్లె మండలం లోని 21 పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది మార్చి నెల 5వ తేదీ లోపు 100% ఇండ్ల పన్నులు వసూలు పూర్తి చేయాలని డి ఎల్ పి ఓ నాగరాజు హెచ్చరించారు. శనివారం ఆయన అధికారుల సమీక్ష మాట్లాడుతూ మండలంలో ఇండ్ల పన్నులు రూ 27.60 లక్షలు డిమాండ్కు గాను రూ 17.54 లక్షలు వసూలు చేశారని ఇంకా రూ 10.08 లక్షలు వసూలు చేయాల్సింది ఉందని చెప్పారు. పన్ను వసూళ్లలో తంబళ్లపల్లె, కోసువారిపల్లి, రెడ్డి కోట, కొటాల పంచాయతీలు వెనుకబడినట్లు చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలలో తాగునీటి కాలుష్యం పై అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళంలో డయేరియా సంఘటన దృష్టిలో ఉంచుకొని సచివాలయ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఉదయం పారిశుధ్యం పై దృష్టి సారించి ఐవిఆర్ సర్వే కాల్ పాజిటివ్ గా పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి కాలుష్యం లేకుండా చూడాలని మరోమారు హెచ్చరించారు. ఆయన వెంట ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతి కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News