నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 14 : మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆగస్టు 18న ముదివేడు క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు బి. ఈశ్వర్ నాయక్ (HG–323) కుటుంబానికి రూ. 30,00,000 ప్రమాద బీమా చెక్కును జిల్లా ఎస్పీ ధీరజ్ శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బాధిత కుటుంబ సభ్యుల స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంకిత భావంతో విధులు నిర్వర్తించే హోంగార్డు అకాల మరణం బాధాకరమని పేర్కొన్నారు. హోంగార్డు కుటుంబానికి పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ యం.శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ యం.పెద్దయ్య, యాక్సిస్ బ్యాంకు ప్రతినిధులు, కౌంటర్ హెడ్ ప్రదీప్, మదనపల్లి బ్రాంచ్ మేనేజర్ అబ్దుల్ రవూఫ్, గవర్నమెంట్ ఆర్ఎం రాజేష్, శాలరీ అకౌంట్ మేనేజర్ హరినాథ్ తదితరులు హాజరయ్యారు. అలాగే హోంగార్డు ఇంచార్జి ఆర్ఎస్ఐ శ్రీను, ఏఆర్ఎస్ఐ బాలాజీ, హెచ్–1 క్లర్క్ గణేష్, పలువురు హోంగార్డులు మరియు బాధితుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News