నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 20 : ప్రకృతి వ్యవసాయంలో జీవన ఎరువులు, కషాయాలతో పండించిన పంటలతో మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని జిల్లా వ్యవసాయాధికారి శివ నారాయణ తెలిపారు. బుధవారం ఆయన తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలలోని ప్రకృతి వ్యవసాయ పంటల క్షేత్రాలను పరిశీలించారు. ప్రతి రైతు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం తో భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందన్నారు. తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కూరగాయలు, ఆకుకూరలు, వరి, మొక్కజొన్న, వేరుశనగ, మిశ్రమ పంటలు వేసిన విధానాన్ని చూసి వారిని అభినందించారు. మండలంలో ప్రకృతి వ్యవసాయం అవగాహనలో ఏపీ ఎల్ ఎన్ ఎఫ్ సిబ్బంది పనితీరు అను ప్రశంసించారు. మండలంలో గుండ్లపల్లి పంచాయతీ లో ప్రకృతి వ్యవసాయం తో పండిన పంటలు అదేవిధంగా మోడల్ స్కూల్లో విద్యార్థులు ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయ పంటల పై ఆరా తీశారు. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే పరమావధిగా రైతు భావించేలా వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఏవో రమణ కుమార్, ఏఈఓ సురేష్, ఏపీ ఎన్ ఎల్ ఎఫ్ సభ్యులు, ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News