Sunday, 26 July 2026 09:52:14 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రకృతి వ్యవసాయం మే మానవాళికి మనుగడ - జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ నారాయణ

Date : 20 May 2026 09:04 PM Views : 94

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 20 : ప్రకృతి వ్యవసాయంలో జీవన ఎరువులు, కషాయాలతో పండించిన పంటలతో మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని జిల్లా వ్యవసాయాధికారి శివ నారాయణ తెలిపారు. బుధవారం ఆయన తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలలోని ప్రకృతి వ్యవసాయ పంటల క్షేత్రాలను పరిశీలించారు. ప్రతి రైతు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం తో భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందన్నారు. తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కూరగాయలు, ఆకుకూరలు, వరి, మొక్కజొన్న, వేరుశనగ, మిశ్రమ పంటలు వేసిన విధానాన్ని చూసి వారిని అభినందించారు. మండలంలో ప్రకృతి వ్యవసాయం అవగాహనలో ఏపీ ఎల్ ఎన్ ఎఫ్ సిబ్బంది పనితీరు అను ప్రశంసించారు. మండలంలో గుండ్లపల్లి పంచాయతీ లో ప్రకృతి వ్యవసాయం తో పండిన పంటలు అదేవిధంగా మోడల్ స్కూల్లో విద్యార్థులు ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయ పంటల పై ఆరా తీశారు. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే పరమావధిగా రైతు భావించేలా వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఏవో రమణ కుమార్, ఏఈఓ సురేష్, ఏపీ ఎన్ ఎల్ ఎఫ్ సభ్యులు, ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :