Sunday, 26 July 2026 11:31:26 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు

Date : 01 March 2026 07:45 PM Views : 262

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 01 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభను విద్యా పర్యటనలో భాగంగా సందర్శించి, రాష్ట్ర బడ్జెట్ సమీక్ష సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం పొందారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ సందర్శన విద్యార్థులకు శాసనసభలో జరిగే ప్రత్యక్ష చర్చలు, ప్రజా సమస్యలపై సభ్యులు వ్యక్తపరిచే అభిప్రాయాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలపై జరిగే విశ్లేషణలు మరియు ప్రజా సంక్షేమ పథకాల అమలుపై తీసుకునే నిర్ణయాల ప్రక్రియలను సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. బడ్జెట్ సమావేశంలో ఆదాయం-వ్యయం లెక్కలు, అభివృద్ధి కార్యక్రమాల కేటాయింపులు, వివిధ రంగాలకు సంబంధించిన ప్రణాళికలు వంటి అంశాలు ఎలా చర్చించబడతాయో విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవనీయులైన స్పీకర్ సి. అయ్యన్న పాత్రుడు ను విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలుసుకుని పరస్పర సంభాషణ జరిపే అవకాశం పొందారని అన్నారు. ఆయన శాసన వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య విలువలు, ప్రజా ప్రతినిధుల బాధ్యతలు మరియు యువత సమాజ నిర్మాణంలో పోషించాల్సిన కీలక పాత్ర గురించి స్పష్టమైన మరియు ప్రేరణాత్మక సందేశాన్ని అందించి, మంచి నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు మరియు ప్రజాసేవ భావనతో ముందుకు సాగాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిట్స్ అధ్యాపకులు మరియు విద్యార్థులకు మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, డీన్-స్కూల్ అఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :