Monday, 27 July 2026 09:51:28 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సోలార్ విద్యుత్తు భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఆదాయ వనరులే - విద్యుత్ ఏ.డి. గోవిందరెడ్డి

Date : 14 June 2026 08:56 PM Views : 82

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 14 ః కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్తు కనెక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో విద్యుత్ ఆదాతో పాటు ప్రతి కుటుంబానికి సోలార్ ఓ ఆదాయ వనరుగా మారుతుందని విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన ఏఈ సురేంద్ర తో కలిసి తంబళ్లపల్లె, గోపిదిన్నె సబ్ స్టేషన్లు పరిశీలించి విద్యుత్తు సరఫరాపై ఆరాతీశారు. వర్షాకాలం దృశ్య విద్యుత్ లైన్లు పై ట్రీ కటింగ్ చేపట్టి విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు , రైతుల విద్యుత్ మోటార్ల వద్ద విద్యుత్ సరఫరా పై ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎ.డి తంబళ్లపల్లె, ఇట్నేని వారి పల్లి తో పాటు పలు చోట్ల సోలార్ విద్యుత్ యూనిట్లను పరిశీలించారు.సోలార్ లబ్ధిదారులు సోలార్ తో నిరంతర విద్యుత్ పొందడం తోపాటు బిల్లులు చెల్లించే పని లేకుండా మాకు అదనంగా డబ్బు ఆదా అవుతున్నట్లు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ఏ.డి మాట్లాడుతూ మండలంలో విద్యుత్ శాఖ సిబ్బంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని తద్వారా వారికి లభించే లబ్ధిపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ బిల్లులు సకాలంలో వసూళ్లపై సిబ్బంది దృష్టి సారించాలని విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో రైతులు, కక్షిదారులు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :