నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 08 : కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మదనపల్లి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై... పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఐసిడిఎస్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో... పింఛన్ల పంపిణీ, గ్రామపంచాయతీ సేవలు, ఆర్టీసీ సేవలు, రిజిస్ట్రేషన్ సేవలు, తదితర సేవలపై ప్రజల నుండి తీసుకున్న అభిప్రాయాలు, ఎం ఎస్ ఎం ఈ పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించగా మదనపల్లె కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రజలకు సంతృప్తి కరస్థాయిలో సేవలు అందించాలని ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాలను సమీక్షించుకొని నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఎమ్మెస్ ఎంఈ పార్కుల ఏర్పాటులో భూ సమీకరణ పెండింగ్లో ఉంటే వెంటనే దానిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Admin
Namitha News