నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 07 : తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లె లో స్మశాన వాటిక లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్థానిక టిడిపి నాయకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం కోసువారిపల్లె లో దళితుడు మృతి చెందడంతో మృతదేహం ఖననానికి స్థలం లేక తవ్విన గుంతల్లోనే తవ్వక తప్పడం లేదు.ఈ సమస్య పరిష్కారానికి గతంలో కోసువారిపల్లె టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, టిడిపి కూటమి నాయకులు గత వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో ఇండ్ల నిర్మాణాలకు పనికిరాని (చౌడు,ఊటు భూమి) స్థలాన్ని కొని లబ్ధిదారులు నిర్మాణాలకు ఒప్పుకోకపోవడంతో నిరుపయోగంగా వదిలేశారు. ఆ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయిస్తే స్థానిక ప్రజలకు దశాబ్దాలుగా స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్య తీరుతుందని జిల్లా మంత్రి తోపాటు పలువురు నాయకులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదు. కోసువారిపల్లె లో సుమారు 500 కుటుంబాలు తోపాటు దళిత గిరిజనులకు స్మశాన వాటిక లేక పోవడం విచారకరం. ఇప్పటికైనా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి కోసువారిపల్లెలో స్మశాన వాటిక ఏర్పాటుకు సహకరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు
Reporter
Namitha News