Sunday, 26 July 2026 11:40:08 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఫెస్ట్ ఆశ్వ్ 2k26

Date : 23 March 2026 08:48 PM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 23 : అంగళ్ళు సమీపం లో నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఆశ్వ్ 2k26 జాతీయ స్థాయి టెక్నో - కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా స్పోర్ట్స్ ను యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం రోజున ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా లెక్కల హితేష్ రావు, నేషనల్ హాకీ ప్లేయర్ పాల్గొన్నారు. ముందుగా మిట్స్ యూనివర్సిటీ ప్రో ఛాన్సల్లర్ నాదెళ్ల ద్వారకానాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాషా జ్యోతి ప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమం లో హితేష్ రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, దేశ నిర్మాణంలో క్రీడల ప్రాముఖ్యత గురుంచి తెలియజేశారు. క్రీడల్లో రాణించాలంటే ఓపిక, ధైర్యం, నిబద్ధత అవసరమని, గెలుపు కోసం కొన్నిసార్లు సంవత్సరాల పాటు కష్టపడాల్సి ఉంటుందని, అందుకు మనోధైర్యం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే ప్రతి క్రీడాకారుడు నిరంతర శ్రమతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్రీడల వల్ల విద్యార్థుల కు జీవితాలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అని, క్రీడల వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆరోగ్యకరంగా మనము ఎదగాలని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు స్పోర్ట్స్ ఉపయోగపడతాయి అని ఆయన అన్నారు. కార్యక్రమంలో నాదెళ్ళ ద్వారకానాథ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లో భాగంగా క్రికెట్, వాలీబాల్ , కబ్బడి మరియు ఇతర పోటీలను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన అన్నారు. వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన క్రీడాకారులను అభినందిస్తూ, గెలుపు-ఓటములు సహజమని, ఓటమితో నిరుత్సాహపడకుండా నిరంతరం కృషి చేస్తే విజయం సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ వై ప్రదీప్ కుమార్, శ్రీ లక్ష్మి ప్రీతీ, ఫీజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: