నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - ఫిబ్రవరి 25 : మదనపల్లి లో ఈ నెల 17వ తేదీన నీరుగట్టువారిపల్లిలో జరిగిన చిన్నారి రిషిక ప్రియ హత్య ఘటన బాధిత తల్లితండ్రులు గోపినాథ్, స్వర్ణ లత దంపతులకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు కుటుంబానికి బాసటగా నిలుస్తూ వారికి ధైర్యాన్ని కల్పిస్తూ నేడు అమరావతి రాష్ట్ర సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రిషిక ప్రియ తల్లిదండ్రులను ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ 15లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మరియు తిరుపతిలో వారికి ఒక సొంత నివాస గృహాన్ని మంజూరు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారాని తెలిపారు. రిషిక ప్రియ తల్లితండ్రులు గోపీనాథ్, స్వర్ణలత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, హోమ్ మంత్రి అనిత మరియు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మదనపల్లి ఎంమ్మెల్యే షాజహాన్ భాషా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు మరియు సీనియర్ నాయకులు యలగిరి దొర స్వామి నాయుడు పాల్గొన్నారు
Admin
Namitha News