నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 10 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కు జాతీయ స్థాయీ లో 11వ స్థానం లో టాపర్ గా ప్రతిభ కనపరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీ రామనాథన్ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు మరియు యన్.పీ.టి.ఈ.ఎల్ వారు సంయుక్తముగా నిర్వహించిన ఆన్లైన్ లో జులై - డిసెంబర్ 2025 సెషన్ లో నిర్వహించిన పరీక్షలలో కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు మొత్తం 9224 సర్టిఫికెట్ కోర్సెస్ కు హాజరు కాగా అందులో 7155 ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయి లో యన్.పీ.టీ.ఈ.ఎల్ సర్టిఫికెట్ ను పొందడమే కాక, 142 మందికి గోల్డ్ రేటింగ్, సిల్వర్ 1419 , ఎల్తేట్ 3623 మరియు టాపర్లుగా 312 కి లభించిందని అంతే కాకుండా కళాశాలకు AAA రేటింగ్ తో పాటు టాప్ 20 లో మిట్స్ కళాశాల 11 వ ర్యాంక్ గా గుర్తింపు ను అందించినట్లు ఆయన అన్నారు. చెన్నై లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటీ మద్రాస్) లో జరిగిన అవార్డు ల కార్యక్రమం లో అసోసియెట్ ప్రొఫెసర్ డా. ఆర్. పృద్విరాజన్ అవార్డు అందుకున్నట్లు ఆయన అన్నారు. కళాశాల కు యెన్.పీ. టీ.ఈ.ఎల్ వారు అందించిన ఈ గుర్తింపుకు కృషి చేసిన విద్యార్థులు మరియు అధ్యాపకులు మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ విద్యార్థుల కు మరియు అధ్యాపకులు కు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Namitha News